కొత్తగూడెం : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఎంజీరోడ్లో ఉన్న శ్రీ విజయవిఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పూజా కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొని నియోజకవర్గ ప్రజలు అష్టఐశ్వర్యాలు , సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఉర్దూఘర్ చైర్మన్ అన్వర్పాషా, టీఆర్ఎస్ నాయకులు తూము చౌదరి, మసూద్, 22వ వార్డు యాకూబ్, పల్లపోతు ప్రేమ్సాయి, మైనార్టీ నాయకులు గౌస్, ఏనుగుల శ్రీను, సీరాజ్, గణేష్ టెంపుల్ ఈవో, అర్చకులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.