పాల్వంచ:అమ్మదయ ఉంటే అంతా శుభమే జరుగుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాత పాల్వంచలోని భద్రాచలం రోడ్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మంటపాన్ని ఆయన సందర్శించి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, ఉత్సవ నిర్వాహకులు వజ్జల రాము, ముక్తేవి గిరీష్, రెడ్డిమళ్ల మణికంఠ, చిన్నపండు, ఫరీద్, సంపత్, మురళి, లెనిన్, గోపాల్రావు, అఖిల్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.