దమ్మపేట: మండల కేంద్రమైన దమ్మపేటలో వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరస్వామిని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మెచ్చాకు ఆలయకమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికి అనంతరం శాలువా కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఆత్మచైర్మన్ కేదాసి వెంకటసత్యనారాయణ(కేవీ), ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, నాయకులు పోతినేని శ్రీరామవెంకట్రావు, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, గోపీశాస్త్రి, అబ్దుల్జిన్నా, దమ్మపేట గ్రామకమిటీఅధ్యక్షులు యార్లగడ్డ బాబు, పానుగంటి చిట్టిబాబు, పసుమర్తి సుదర్శన్రావు, కౌలూరి నాగయ్య, అత్తులూరి పాపారావు, రాయల నాగేశ్వరరావు, బొల్లికొండ ప్రభాకర్, యువనాయకులు అబ్దుల్, ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.