చండ్రుగొండ: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మంగయ్యబంజర గ్రామానికి చెందిన భూక్య శ్యాం(45) కుటుంబ సభ్యులను పరామర్శించారు.భూక్య శ్యాం చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతేకాకుండా గుర్రాయిగూడెంలో ఇటీవల మృతి చెందిన కొమ్మినేని ముత్తయ్య(70), అనుమోలు హనుమంతరావు(38)ల కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు.
ఆయన వెంట గుంపెన సోసైటి వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, ఎంపిటీసీ దారాబాబు, టిఆర్ఎస్ జిల్లా మేడా మోహన్రావు, ఉప్పతల ఏడుకొండలు, పసుపులేటి వెంకటేశ్వర్లు, గుగులోత్ ఈర్యానాయక్, తదితరులు ఉన్నారు.