దమ్మపేట: అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాటి సుబ్బన్నగూడెంలోని తన నివాసంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుటుంబసభ్యులతో కలిసి బాణాసంచా కాల్చి ఆనందోత్సాహాలనడుమ పండుగను జరుపుకున్నారు.
మహిళలు ఇంటి బయట దీపాలను వెలిగించారు. అనంతరం రాత్రి వేళల్లో యువకులు, చిన్నారులు, కుటుంబసభ్యులు బాణాసంచా కాల్చారు.