ఇల్లెందు :ప్రతీ ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. పారిశుధ్య కార్మికులు ప్రతీరోజు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. డ్రైనేజీ, రోడ్డు పై చెత్తా, చెదారం వేయవద్దని సూచించారు. వ్యాపారులు తమ షాపుల ముందు చెత్త వేయరాదన్నారు. మున్సిపల్ ట్రాక్టర్కు షాపులలోని చెత్తను తడి, పొడిగా వేర్వేరుగా ఇవ్వాలన్నారు.
డ్రైనేజీల్లో చెత్త వేసిన దుకాణ యజమానుల పై చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణాన్ని పరిశుశుభ్రంగా తీర్చిదిద్దుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్రజలందరూ పాలకవర్గానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అంజన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.