కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. విద్యుత్ కేంద్రంలోని బాచింగ్ ప్లాంట్లో పడి ఓ కార్మికుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని శివకుమార్గా గుర్తించారు. అతడు విద్యుత్ కేంద్రంలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ప్రమాద ఘటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.