కొత్తగూడెం: కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కొత్తగూడెం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు రోజుల శిక్షణా తరగతులు మంగళవారంతో ముగిశాయి. తేనెటీగల పెంపకంపై ఏడు రోజుల శిక్షణ ఇచ్చారు. ఈశిక్షణలో రైతులు, యువత, మహిళలు పాల్గొన్నారు. కేవీకే ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డక్టార్ వి.లక్ష్మీనారాయణమ్మ మాట్లాడుతూ… ఈ శిక్షణ అనంతరం అభ్యర్థులకు తేనెటీగల పెంపకంలో పోస్ట్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించి అర్హులుగా ప్రకటించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ ఆర్.విశ్వతేజ, బి.శివ, వింధ్య తదితరులు పాల్గొన్నారు.