భద్రాద్రి కొత్తగూడెం : కొవిడ్-19 పాజిటివ్ బారిన నక్సల్స్ వైద్య చికిత్స నిమిత్తం పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పిలుపునిచ్చారు. సీపీఐ(మావోయిస్టు) పార్టీలో కొంతమంది నాయకులు, క్యాడర్ కరోనాతో బాధపడుతున్నట్లుగా తమకు సమాచారం అందిందన్నారు. దిగువస్థాయి నాయకులు, సభ్యులకు మెరుగైన వైద్య చికిత్సను అందించేందుకు మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు నిరాకరిస్తే వారు వెంటనే పార్టీని విడిచిపెట్టి పోలీసులు సహాయం తీసుకోవాల్సిందిగా ఎస్పీ పేర్కొన్నారు.