కొత్తగూడెం: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని,అందుకే ఉర్డూఘర్ చైర్మన్గా అన్వర్ పాషాను నియమించడం జరిగిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉర్దూఘర్లో జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేయడం తన లక్ష్యమని తెలిపారు.
రానున్న రోజుల్లో కొత్తగూడెం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, ఎవరూ పట్టించుకోని సమయంలో నేనే ఉర్ధూఘర్కు స్థలం ఇచ్చి నిర్మాణం చేయించానని అన్నారు. మైనారిటీల కోసం నేను శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. స్థానిక కౌన్సిలర్ విన్నపం మేరకు మరో రూ.15 లక్షలు ఉర్ధూఘర్కు కేటాయిస్తున్నానని అన్నారు.
ప్రజాసమస్యలే నాకు ప్రదాన ఎజెండా అని అందుకే నన్ను ప్రజలు ఆదరించారని అన్నారు. సామాన్య కార్యకర్తగా పనిచేసిన అన్వర్పాషాకు మంచి గుర్తింపు ఇవ్వడం జరిగిందని, నమ్ముకున్న వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని వనమా పేర్కొన్నారు.