కొత్తగూడెం : జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు కొత్తగూడెం జిల్లా క్రీడాకారుడు ఎంపికయ్యారు. రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన గూడెల్లి సాయితేజ ఎంపికయ్యాడు. ఈ నెల 5వ తేదీన మెదక్జిల్లాలోని తూప్రాన్లో జరిగిన రాష్ట్రస్థాయి సెలెక్షన్స్ లో సాయితేజ పాల్గొన్నారు. తన ప్రతిభను కనపర్చడంతో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు పంజాబ్ లో జరిగే జూనియర్ నేషనల్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరపున పాల్గొనన్నట్లు జిల్లా కార్యదర్శి నవీన్కుమార్ తెలిపారు. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పలువురు క్రీడాసంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు అభినందనలు తెలిపారు.