శ్రీరాంపూర్, మే 21: సింగరేణిలో జాతీయ సంఘాలకు స్థానం లేదని, వాటికి నూకలు చెల్లాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శ్రీరాంపూర్లోని ఆర్కే 5గనిపై ఉ పాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూలే గతంలో వారసత్వ ఉద్యోగాలు చేజేతులా పోగొట్టాయని మండిపడ్డారు. వేలాది మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేశారని ఆరోపించారు. బీజేపీ మిత్రుడు అదానీకి లాభం చేకూర్చేందుకే విదేశీ బొగ్గు కొనాలని కేంద్రం పరిశ్రమలపై ఒత్తిడి తెస్తున్నదని మండిపడ్డారు. 10 శాతం విదేశీ బొగ్గు కొనుగోలు చేయాలని ఆంక్షలు విధించి, తద్వారా అదానీకి లాభం చేకూర్చేందుకే నరేంద్రమోడీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలోని 12 రాష్ర్టాల్లో విద్యుత్ సంస్థల్లో బొగ్గు కొ రత ఉందన్నారు. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వమేనని మం డిపడ్డారు. దేశంలోని ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమలు 250 గనుల కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతున్నాయని చెప్పారు. అందులో సింగరేణికి చెందినవి 15 గనులున్నాయని చెప్పారు. వీటికి కేంద్రం అనుమతి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నదని, ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు. సింగరేణిలో కార్మికులకు అనేక హక్కులు సాధించిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందన్నారు. కారుణ్య ఉద్యోగాలతో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఆర్కే 5గనిపై టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి రామిడి మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో 70 మంది బదిలీ వర్కర్లు టీబీజీకేఎస్లో చేరగా, వారికి ప్రధాన కా ర్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్, ఏరియా చ ర్చల ప్రతినిధులు వెంగళ కుమారస్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు అడ్డు శ్రీనివాస్, నెల్కి మల్లేశం, జగదీశ్వర్రెడ్డి, పిట్ కార్యదర్శులు గోపాల్రెడ్డి, సత్యనారాయణ, చిలుముల రాయమల్లు, మెండ వెంకటి, నాయకులు ఆనందం, శంకర్, రాజయ్య, మల్ల య్య, గట్టు సమ్మయ్య, కాచు పోచయ్య, మన్మోహన్, సురేంద ర్, శ్రీనివాస్, చారి పాల్గొన్నారు.