కొత్తగూడెం : జీవితాంతం ప్రజలతో మమేకమై వారి సమస్యలపై స్పందిస్తూ రచనలు చేసిన నిజమైన ప్రజాకవి, ప్రజల మనిషి కాళోజీ నారాయణరావు అని, తెలంగాణ గొంతుకగా ఉన్న ఆయన చిరస్మరణీయుడని జీఎం సూర్యనారాయణ అన్నారు. గురువారం సింగరేణి భవన్లో నిర్వహించిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాళోజీ నిరంతరం పేద ప్రజల పక్షాన నిలబడి అన్యాయాలను ప్రత్యక్షంగా ఎదిరించడమే కాకుండా అటువంటి వాటిపై రచనల ద్వారా అందరిలోనూ చైతన్యాన్ని నింపిన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.
కాళోజీ తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని, అన్యాయాలను ఎదిరించిన వాళ్లకు అండగా నిలుస్తూ కవిత్వాన్ని రాశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంవోఏఐ ప్రధాన కార్యదర్శి ఎన్వీ రాజశేఖర్రావు, జీఎం మార్కెటింగ్ రవిశంకర్, జీఎం స్టాటెజిక్ ప్లానింగ్ సురేందర్, ఏజీఎం ఫైనాన్స్ రాజేశ్వర్, అడ్మినిస్ట్రేవ్ మేనేజర్ భాస్కర్, కమ్యూనికేషన్ ఆఫీసర్ గణాశంకర్ పూజారి, వివిధ విభాగాల అధిపతులు, సింగరేణి భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు.