చుంచుపల్లి : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, ఎంపీపీ బాదావత్ శాంతిలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సకినాల రమేష్, ఎంపీవో సత్యనారాయణ, ఎంపీటీసీ కూసన వీరభద్రం, కో-ఆప్షన్ మెంబర్స్ ఆరీఫ్ఖాన్, ఉర్దూఘర్ డైరెక్టర్ ఖయ్యూం భాయ్, టీఆర్ఎస్ నాయకులు తొగరు రాజశేఖర్, రామన్, ముక్తి రాధాకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ పాల్గొన్నారు.