కొత్తగూడెం: జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా పల్లె దవాఖానాల్లో సేవలందించేందుకు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హుల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ శిరీష ఓ ప్రకటనలో తెలిపారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి కాంట్రాక్టు పద్దతిన నెలకు రూ.40 వేలు వేతనంఇవ్వడంజరుగుతుందని,మరిన్నివివరాలనుwww.bhadradrikothagudem.telangana.gov.in లో పొందుపర్చామని ఆమె తెలిపారు.
ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పనిదినాల్లో డీఎంహెచ్వో కార్యాలయంలో ధరఖాస్తులను సమర్పించవచ్చని పేర్కొన్నారు.