కొత్తగూడెం : జిల్లాలోని దివ్యాంగ విద్యార్థినీ, విద్యార్థులకు 9, 10 తరగతులకు ప్రీ మెట్రిక్, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ కోసం ధరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిణి వరలక్ష్మీ తెలిపారు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నుంచి మినీస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సూచనల మేరకు www.disabilityaffairs.gov.in ద్వారా ధరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు. ప్రీ మెట్రిక్ కోసం ఈ నెల 15వ తేదీ వరకు, పోస్టు మెట్రిక్ కోసం ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉందని ఆమె తెలిపారు.