కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో నదిలో వరద ప్రవాహం అధికమవుతున్నది. శుక్రవారం ఉదయం భద్రాచలం వద్ద 19.9 అడగుల మేర గోదావరి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం నదిలో 1,84,396 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. కాగా, ఎడతెరపి లేని వర్షాల కారణంగా గోదావరిలో వరద మరింత పెరగనుందని సీడబ్ల్యూసీ సూచించింది. నదీ పరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకూ పెరిగిపోతుండటంతో అధికారులు అందుబాటులో ఉండాలిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించారు.