దుమ్ముగూడెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గులాబ్ తుపాను ప్రభావంతో మండలవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు జోరున వర్షం కురవడంతో మండలంలో 35.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో గ్రామాల్లో, మండల కేంద్రంలో జనజీవనం స్తంభించింది. మారాయిగూడెం గ్రామంలోని పరికలవాగు చెరువు నిండటంతో అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది.