చండ్రుగొండ: రైతుల కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని టిఆర్ఎస్ అశ్వరావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ అన్నారు. మంగళవారం గానుగపాడు సహకార సంఘం పరిధిలో గల తిప్పనపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు జాతీయ రహదారిపై ఆరబోసుకున్న ధాన్యాన్ని కాటా వేసేలా చూడాలని కోరగా, నేరుగా డిసిఓతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను డిసిఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ గాదె లింగయ్య, మానిటరింగ్ అధికారి శ్రీనివాసరావు, రైతులు ఆకుల శ్రీనివాసరావు, గుగులోత్ రమేష్, మీగడ వెంకటనారాయణ, పసుపులేటి మంగయ్య, సయ్యద్ షపీ, వేల్పుల లింగయ్య, ఉపేందర్,రామిశెట్టి రామారావు, రాజబోయిన యాకయ్య తదితరులు పాల్గొన్నారు.