భద్రాచలం: భద్రాచలం గోదావరి తీరంలో నిమజ్జన ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివస్తున్నాయి. గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన ర్యాంప్ వద్ద క్రేన్ల సాయంతో లాంచీలోకి విగ్రహాలనుఎక్కిస్తున్నారు. విగ్రహాలు లాంచీలోకి ఎక్కించి వాటిని గోదావరి మధ్యలోకి తీసుకు వెళ్లి నిమజ్జనం చేస్తున్నారు.
వేల సంఖ్యలో విగ్రహాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్భందీ ఏర్పాట్లు చేయడంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉన్నది. సోమవారం వరకు 1500విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు భద్రాచలం తహశీల్థార్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమాలను సబ్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్, సీఐ స్వామి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ సిద్ధార్థ మహంతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.