సారపాక : ముప్పై ఐదుఏళ్లుగా ఐటీసీ పీఎస్పీడీలో ఉద్యోగిగా, కార్మిక నాయకునిగా పరిటాల ప్రసాద్ చేసిన సేవలు మరువలేనివని శ్రామికశక్తి ఎంప్లాయీస్, బదిలీస్ యూనియన్ (టీఆర్ఎస్కేవీ) అధ్యక్షుడు సానికొమ్ముశంకర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఉద్యోగ విరమణ సందర్భంగా శంకర్రెడ్డి తన మిత్రబృందంతో కలిసి పరిటాలప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. కంపెనీలో వివిధ విభాగాల్లో పనిచేసి కంపెనీ అభివృద్ధితో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నాయకునిగా చేసిన సేవలు మరువలేనివన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పూదోట అంతయ్య, దడిగల హరినాథ్, జీవీ ఆర్కేరాజు, రవికుమార్, సతీష్, దోసపాటి సురేష్, వెంకటనారాయణ, రాంబాబు, భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.