చండ్రుగొండ: పోడుభూములపై తమకు హక్కు వచ్చే దాకా పోరుసాగిస్తామని తిప్పనపల్లి పోడుభూముల రైతులు స్పష్టం చేశారు. మంగళవారం తిప్పనపల్లిలో పోడుభూముల్లో నిరసనదీక్షను చేపట్టారు. అనంతరం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పోడుభూముల రైతులు మాట్లాడుతూ…1992 నుంచి పోడుభూమిని సాగు చేసుకుంటున్నామని, అటవీ అధికారులు ఇప్పుడు వచ్చి, హక్కు పత్రాలు లేవనే సాకుతో లాక్కోవడం సరికాదన్నారు. 1997లోనే 24 మందిపై ఫారెస్టు అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపారని, 2005 అటవీహక్కుల చట్టం ప్రకారం పోడుదారులకు పట్టాలివ్వాలన్నారు.