భద్రాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. మంగళవారం రాత్రి సీతారామస్వామి ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది.
ఎదుర్కోలు ఉత్సవాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు తిలకించారు. రేపు ఉదయం రామాలయంలోని శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రామయ్య కల్యాణం కనుల పండువగా జరుగనుంది.
కొవిడ్ పరిస్థితి నేపథ్యంలో స్వామివారి కల్యాణోత్సవం రామాలయంలో నిరాడంబరంగా జరుగనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి