చండ్రుగొండ: విద్యార్దులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పాఠశాలకు హాజరుకావాలని డీపీఎంఓ వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం మద్దుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ…ప్రతి రోజూ నిర్భయంగా విద్యార్థులు పాఠశాలకు రావచ్చని భరోసా ఇచ్చారు. అందరూ తప్పనిసరిగా శానిటైజర్ వాడాలని సూచించారు. భౌతికదూరం పాటిస్తూ తరగతి గదులల్లో కూర్చోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిబ్బంది శారారాణి, సుశీల, తదితరులు పాల్గొన్నారు.