భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ దాత విరాళం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఆత్మూరి ప్రకాశరావు, కాశీ అన్నపూర్ణ దంపతులు రూ. 50,116లు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా వీరు రామయ్యను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం దేవస్థానం అధికారులకు వితరణ అందజేసి రశీదును స్వీకరించారు.