చర్ల: తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దులో మావోయిస్టులు నిర్వహించే మీటింగులకు అవసరమైన ఏర్పాట్లను గురించి చర్చించేందుకు హాజరు కావాలని మావోయిస్టులు ఆదివాసీలపై వత్తిడి తెస్తున్నారని సిఐ అశోక్ అన్నారు. ఆదివాసీలు అటువంటి మీటింగులకు హాజరు కావద్దని ఆయన పేర్కొన్నారు. మీటింగులకు హాజరుకావాలంటూ మావోయిస్టులు సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన అన్నారు.
సమావేశాలకు హాజరు కాకపోతే చిత్రహింసలకు గురిచేస్తామని బెదిరిస్తున్నారని బెదిరింపులకు భయపడవద్దని సీఐ అశోక్ అన్నారు. మావోయిస్టులు ఆదివాసీలతో అనేక చట్టవ్యతిరేక పనులు చేయిస్తున్నారని ఆయన చెప్పారు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఎటువంటి మీటింగులకు హాజరు కావద్దని సిఐ అశోక్ ఆదివాసీలను కోరారు.