ఇల్లెందు: జిల్లా రిజిస్ట్రార్ కుమార్ ఇల్లెందు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్ళుగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లను పరిశీలించానని, జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల రిజిస్ట్రేషన్లు పుంజు కున్నాయని, కరోనా టైమ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయని చెప్పారు.