అశ్వారావుపేట: పల్లె ప్రగతి పథకంలో పంచాయతీలలో నిర్వహించిన పలు అభివృద్ది పనులను సోమవారం జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి తనిఖీ నిర్వహించారు. పల్లె ప్రగతిలో నిర్వహించిన పారిశుద్యం, హరితహారం మొక్కల సంరక్షణ, నర్సరీలలో మొక్కలపెంపకం, రోడ్లు నిర్వహణ నాణ్యత వంటి పనులను పరిశీలించారు.
కొత్తగూడెం ఆర్డిక్యూఈ జేఈయు అనిల్ కుమార్ మండలంలోని అశ్వారావుపేట, రామన్నగూడెం, దిబ్బగూడెం, మల్లాయగూడెం పంచాయతీలలో పనుల నాణ్యతను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జేఈ మాట్లాడుతూ మేజర్పంచాయతీలో పల్లెప్రగతి పనుల నిర్వహణ బాగుందని శానిటేషన్పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.