కొత్తగూడెం : ఇటీవల గోవాలో జరిగిన ఐదవ జాతీయ స్థాయి క్రీడల్లో కొత్తగూడెం జిల్లా విద్యార్థినులు సత్తాచాటారు. అంతర్జాతీయ కబడ్డీ, రన్నింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్ మండలం మారుమూల ప్రాంతానికి చెందిన రైతు కత్తి లక్ష్మణ్ – పద్మల కుమార్తె కత్తి ప్రశాంతి ములకలపల్లి గురుకులంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. మండలానికి చెందిన క్రీడాకారిణి బంగారు పతకం సాధించడం పట్ల పలువురు నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీత, అధ్యాపకులు పాల్గొన్నారు.