అశ్వారావుపేట : దసరా నవరాత్రోత్సవాల్లోభాగంగా తొమ్మిదోరోజు గురువారం వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు భక్తులకు కాళికాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిదిలో తొమ్మిదేండ్ల లోపు బాలికలకు నవదుర్గమ్మల రూపంలో అలంకరించి అర్చనలు నిర్వహించారు. అమ్మవారికి తెల్లవారు జాము నుంచే అభిషేకాలు, అలంకరణ, కుంకుమ పూజలు, దూపదీప నైవేద్యాలు సమర్పించారు. రామాలయం వద్ద, నాయిబ్రాహ్మణ బజార్తో పాటు బీసీ కాలనీ, గుర్రాల చెరువు తదితర కాలనీల్లో దేవీనవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి.