భద్రాచలం: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాలను నివారించాలని భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై శ్రీపతి తిరుపతి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఉన్న ఆటో కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అందరూ ప్రయాణీకులతో మర్యాదగా వ్యవహరించి, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని పేర్కొన్నారు. నిర్ధేశించిన ధరలకే ప్రయాణీకుల వద్ద నుంచి ఛార్జీలు వసూలు చేయాలని కోరారు.
ఆటోలు సౌండ్ బాక్సులు తొలగించాలని, డ్రైవర్లు యూనిఫారం తప్పక ధరించాలని అన్నారు. ప్రతి ఆటోకు టాప్ నెంబర్, అన్ని రకాల అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, అంతేకాకుండా మద్యం సేవించి ఆటోలు నడపకుండా ఆటో యూనియన్ అథ్యక్ష, కార్యదర్శులు కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.