చండ్రుగొండ : మండల పరిధిలోని పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం పాఠశాలలో వైద్యసిబ్బంది విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించగా ఏ ఒక్కరికీ కరోనా పాజిటివ్ రాలేదు. ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ…ఇటీవల పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ రావడంతో విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించామన్నారు. అనంతరం పాఠశాలలో శానిటైజేషన్ చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఇమామ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.