భద్రాచలం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కరోనా కలకలం రేపిండి. భద్రాచలం వెళ్లిన ఐదుగురు పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నుంచి ముక్కోటి విధులకు భద్రాచలం వెళ్లిన ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో స్టేషన్లో ఉన్న మిగతా సిబ్బందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన వారు అప్రమత్తమయ్యారు.