భద్రాద్రి కొత్తగూడెం : నైట్ కర్ఫ్యూ అమలులో ప్రజలు పోలీసులకు సహకరించాల్సిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.కొవిడ్ -19 నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలులో ప్రజలు సహకరించాల్సిందిగా కోరారు.
అన్ని వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను రాత్రి 8 లోపు మూసివేయాల్సిందిగా సూచించారు. కర్ఫ్యూ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. కర్ఫ్యూ అమలులో జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు ప్రజలు సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి మరొక ప్రకటనలో తెలిపారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దన్నారు.