కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. కుండపోతగా వానకురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలో భారీగా వరదనీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. లక్ష్మీదేవిపల్లి మండలంలో ఇందిరానగర్, అశోక్నగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
ఇక జిల్లాలోని కిన్నెరసాని, సింఘభూపలెం, తాలిపేరు, మూకమామిడి ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇల్లందు, అశ్వారావుపేట, మణుగూరు, భద్రాచలం నియోజకవర్గాల్లో భారీ వర్షం కురుస్తున్నది. కుంటలు, చెరువులు వర్షపు నీటితో నిండి పోయాయి. రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.