అన్నపురెడ్డిపల్లి: పేదల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ… పేదల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ నిధి నుంచి కోట్లాది రూపాయాలను కేటాయించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తుందని, ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్రావు, నాయకులు కొత్తూరి వెంకటేశ్వరరావు, మాధవరెడ్డి పాల్లొన్నారు.