భద్రాచలం: ఆదివాసీ ప్రాంత పర్యటనకు విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా చొంగ్తూను కలిసి ఏజన్సీలోని సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమన్వయకర్త మడివి నెహ్రూ కోరారు. గురువారం భద్రాచలం విచ్చేసిన కమీషనర్కు ఏజన్సీలో ఆదివాసీలు ఎదుర్కోంటున్న సమస్యల గురించి వివరించారు.
ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులను నియమించాలని, ఆదివాసీల దినోత్సవాన్ని 9తెగల ఆదివాసీలతో కమిటీ వేసి నిజమైన ఆదివాసీలతోనే నిర్వహించాలని కోరారు. 1/70చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసేలా రెవిన్యూ, పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించాలని కోరారు.