భద్రాచలం: అనాథ పిల్లలను దత్తత తీసుకునే దంపతులు తమ పాన్ కార్డుతో కారా (www.cara.nic.in) వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీడీపీఓ నవ్యశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. రెండవ దశలో ఫ్యామిలీ ఫోటో, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్పోర్ట్, కరెంటు బిల్లు, ఆదాయ ధృవీకరణ పత్రం ఉద్యోగస్తులయితే జీతం సర్టిఫికెట్, వివాహ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు.
అలాగే తల్లిదండ్రులిద్దరివి పుట్టిన తేది ధృవీకరణ పత్రాలు, నోటరీ నుంచి పుట్టిన తేది అఫిడవిట్, తల్లిదండ్రుల మెడికల్ టెస్ట్లు విడివిడిగా హెచ్ఐవీ, హెపటైటిస్ – బీ, టీబీ, ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపారు. మూడో దశలో హోమ్ స్టడీ సమయంలో అప్లోడ్ చేసిన ధృవీకరణ పత్రాలతో పాటు రూ. 6వేలు డీడీ రూపంలో ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి పథక సంచాలకులు, జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ, అనంతరం వారికి డీడీతో ధరఖాస్తు సమర్పించాలని కోరారు.
దత్తత సమయంలో తల్లిదండ్రుల ఆస్తి వివరాల నకలు పత్రాలు, గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి సిద్ధంగా ఉంచుకోవాలని, బిడ్డను దత్తత తీసుకునే సమయంలో సంస్థ వారికి డీడీ రూపంలో రూ. 40వేలు అందజేయాలన్నారు.