కొత్తగూడెం : మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన12వ వార్డు ఎస్సీబీ నగర్, కొత్తగూడెం రైల్వే అండర్బ్రిడ్జిలను సందర్శించారు. గులాబ్ తుపాన్ కారణంగా రానున్న 48 గంటలు రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, కమిషనర్ అరిగెల సంపత్కుమార్, డీఈ నవీన్కుమార్, ఏఈ రాము, టీపీవో ప్రభాకర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వీరభద్రాచారీ, జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు.