భద్రాచలం: శిక్షణ పొందిన యువత ఖాళీగా ఉండకుండా ఏదొక ఉపాధి ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని జేడీఎం (జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్) హరికృష్ణ అన్నారు. మంగళవారం ఐటీడీఏ భద్రాచలం పీఓ గౌతమ్ పొట్రు ఆదేశాల మేరకు యువజన శిక్షణ కేంద్రం (వైటీసీ)లో డ్రైవింగ్ శిక్షణ పొందిన గిరిజన యువతకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేడీఎం మాట్లాడుతూ శిక్షణ పొందిన గిరిజన యువతకు డ్రైవింగ్లో ఉన్న ఉపాధి అవకాశాలు, ప్రభుత్వం అందించే పథకాల గురించి వివరించారు.
డీడీయూజీకేవై ద్వారా అందించే డ్రైవింగ్ శిక్షణకు ఆసక్తిగల యువత ఐటీడీఏ కార్యాలయంలో ఉన్న భవిత సెల్లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 42మంది ఎల్ఎంవీ డ్రైవింగ్, 18మంది డ్రైవింగ్ శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.