దమ్మపేట: మండల పరిధిలోని కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ రాజేశ్వరి,రాజు ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం పుష్పాలు విరబూసాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బ్రహ్మకమలాలు విరబూసాయి. అయితే కార్తీకమాసంలో శివునికి ప్రీతికరమైన బ్రహ్మకమలాలు విరబూయడంతో సర్పంచ్ రాజేశ్వరి,రాజు దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మకమలం మొక్క వద్ద పూజలు నిర్వహించారు. బ్రహ్మకమలాలు పూసిన విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగూ మహిళలు సైతం ఆమె నివాసానికి చేరుకుని సర్పంచ్ దంపతులతో కలిసి పూజలు చేశారు.