మణుగూరు : రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఆర్టీసీ డిపో ఆవరణలో ఎండీ సజ్జనార్ పిలుపు మేరకు ఆర్టీసీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. లయన్స్క్లబ్ మణుగూరు సభ్యులు, శ్రీవిద్య విద్యా సంస్థల విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రక్తదాతలకు పండ్లు, బిస్కెట్లు, జ్యూస్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ సిద్దులు, దేవప్ప, జేవీఎస్ చంద్రశేఖర్, టీఎస్ఆర్టీసి డిపో మేనేజర్ విజయ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, బొలిశెట్టి నవీన్, ముద్దంగుల కృష్ణ, హర్షవర్దన్ నాయుడు తదితరులున్నారు.