అశ్వారావుపేట: నామా ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో మండలంలోని దురదపాడు గ్రామంలోని నిరుపేద గిరిజనులకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు దుప్పట్లు పంపీణీ చేశారు. ఆర్దిక ఇబ్బందులతో ఉన్న నిరుపేదలను గుర్తించి చలికాలంలో వారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో దుప్పట్లు పంపీణీ చేయటం జరిగిందన్నారు. నామా ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎంపీటీసీ పండా రాజులు, నారాయణపుర సొసైటి డైరెక్టర్ కాకా సత్యనారాయణ,పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సున్నం వెంకటేశ్వరరావు,కోటేష్, పెద్దకాపు కోర్రం కన్నయ్యలు పాల్గొన్నారు.