చండ్రుగొండ:కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తుందని జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం తిప్పనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కేంద్రం సర్కారు ద్వంద్వ విధానాల వల్ల నేడు వరి రైతుల పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, యాసంగిలో వరి వేయాల్నా వద్దా అనే విషయాలను బహిర్గతపర్చాలని డిమాండ్ చేశారు.
బిజేపి విధానాలపై త్వరలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల నాయకులు గోవిందరెడ్డి, ధరావత్ రామారావు, మచ్చా కుమార్, రామిశెట్టి వెంకటేశ్వర్లు,దరావత్ పార్వతి, జాకీర్, తదితరులు ఉన్నారు.