భద్రాచలం: బ్రహ్మకుమరీస్ ఆధ్వర్యంలో రాజయోగ శిక్షణ కేంద్ర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాచలంలోని ఈ నెల 20న నూతన రాజయోగ శిక్షణ కేంద్ర నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మాకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం భద్రాచలం శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్, శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ, 141బెటాలియన్ కమాండెంట్ హరి ఓం ఖరే పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.