పాల్వంచ :కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 3 వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తలపెట్టిన భారత్బంద్ పాల్వంచలో విజయవంతమైంది. జోరు వానను సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచి వామపక్ష, ప్రతిపక్ష పార్టీల నాయకులు బంద్కు సహకరించాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… 3 వ్యవసాయ చట్టాలను, నూతన కార్మిక చట్టాలను, నూతన విద్యావిధానం 2020, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేసేంత వరకు ప్రజలతో పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
పాల్వంచలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. వామపక్ష నాయకులను పోలీసులు అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ముత్యాల విశ్వనాథం, వీసంశెట్టి పూర్ణచందర్రావు, ఉప్పుశెట్టి రాహుల్, పద్మజ, వీసంశెట్టి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.