భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం అంతరాలయంలోని మూలమూర్తులకు స్వర్ణ కవచాలను ధరింపజేశారు. ఈ ప్రత్యేక అలంకరణలో సీతారామ, లక్ష్మణులు మరింత రమణీయంగా కనిపించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన నిత్య బలిహరణం, నిత్య హోమాలు నిర్వహించారు.