భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అంతరాలయంలోని మూలమూర్తులకు ముత్యాలు పొదిగిన వస్త్రాలను ధరింపజేశారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన,సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీసీతా, రామ, లక్ష్మణ ఉత్సవమూర్తులను బేడా మండపంలో వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, ఫుణ్యఃవచనం చేశారు.