సత్తుపల్లి, జూన్ 14 : సత్తుపల్లి లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. లయన్స్క్లబ్ బాధ్యులు అందించిన కాన్సన్ట్రేటర్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ వసుమతిదేవికి సోమవారం అందజేసి మాట్లాడారు. కరోనా బాధితుల కోసం అత్యాధునిక పరికరాలుగా ఎంతో ఉపయోగపడతాయన్నారు. దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కోరారు. అనంతరం కరోనా బాధితులకు పౌష్టికాహారం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, లయన్స్బాధ్యుడు గండ్ర సోమిరెడ్డి, కొత్తూరు ప్రభాకర్రావు, జంగా సత్యనారాయణ, కొత్తూరు సత్యనారాయణ, తోట రమేశ్, వెల్ది జగన్మోహనరావు, కొడిమెల అప్పారావు, భీమిరెడ్డి పుల్లారెడ్డి, కొత్తూరు ఉమ, మల్లూరు అంకమరాజు, కౌన్సిలర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
సత్తుపల్లి, జూన్ 14 : కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాకారులకు నిత్యావసరాలు అందించడం అభినందనీయమని టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్కుమార్ అన్నారు. సోమవారం కిరణ్ ఫౌండేషన్ సహకారంతో డివిజన్లోని కళాకారులకు నిత్యావసరాలు అందించి మాట్లాడారు. కార్యక్రమంలో కిన్నెర మణి, అశ్విని, రాధాకృష్ణ, రామకృష్ణ, శివశంకర్, మంజు తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సేవలు అభినందనీయం : ఎమ్మెల్యే
సత్తుపల్లి రూరల్, జూన్ 14 : డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ కరోనా కష్టకాలంలో చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ బయ్యన బాబూరావు, బాధ్యులు బండి నాగేశ్వరరావు సత్తుపల్లి ఐసొలేషన్ కేంద్రానికి రూ.లక్ష చెక్కును ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ఇప్పటికే ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ బాధ్యులు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, వందనపు సత్యనారాయణ, గుండు ఉమామహేశ్వరరావు, మల్లూరు అంకమరాజు, రాజేశ్, చిత్తలూరి ప్రసాద్, గాదె నర్సింహారెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కిష్టారంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రానికి సొసైటీ చైర్మన్ మామిళ్లపల్లి కృష్ణయ్య రూ.5వేలు, ఎంపీటీసీ పాలకుర్తి సునీతారాజు రూ.5వేలు నగదు,2.50 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటిస్తూ కరోనాను పారదోలాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, సర్పంచ్ శెట్టిమాల రేణుకాఈశ్వర్, వైస్ సర్పంచ్ కొలపనేని ధనుంజయ, నాయకులు ఉడతనేని అప్పారావు, జువ్వాజి అప్పారావు, కొడిమెల అప్పారావు, నరేంద్ర, ఎంపీడీవో సుభాషిణి, సెక్రటరీలు రవి, దీప్తి తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి, జూన్ 14 : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని వీఎం బంజరు ఎస్సై నాగరాజు అన్నారు. మండలంలోని టెంట్హౌస్ నిర్వహకులతో పోలీస్స్టేషన్ ఆవరణలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సు లో మాట్లాడారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై కవిత ఉన్నారు.
కామేపల్లి, జూన్ 14 : కరోనా కట్టడిలో జర్నలిస్ట్ల పాత్ర కీలకమని ముచ్చర్ల సర్పంచ్ జాయ్లూసీ అన్నారు. జర్నలిస్ట్లకు సోమవారం మాస్క్లు, శానిటైజర్లను అందించారు.
కొణిజర్ల, జూన్14 : మండలంలోని గ్రామాల్లో వైద్యాధికారి డాక్టర్ మోతియా ఆధ్వర్యంలో సోమవారం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా సోకిన వారికి మందులు పంపిణీ చేసి ఐసొలేషన్ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు. కొణిజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా సోమవారం మొత్తం 23 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వ సూచన మేరకు పూజారులకు, పాస్టర్లకు, ఇమాంలకు గురువారం వరకు వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కారేపల్లి,జూన్ 14: తెలంగాణ మోడల్ పాఠశాల, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో కరోనా బాధితులకు సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, టీఆర్ఎస్ నాయకులు పండ్లు, ఆహారపదార్థాలను సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, అజ్మీర వీరన్న,సర్పంచ్లు ఇస్లావత్ సుజాత-బన్సీలాల్,అజ్మీర అరుణ,నాయకులు రాజేష్,వాంకుడోత్ కరణ్, రామ్కిశోర్, హారూ, రాందాస్, నాగలక్ష్మి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
వైరా, జూన్14 : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలను డాక్టర్ శశిధర్ ఆధ్వర్యంలోనిర్వహించారు. మొత్తం 472 మందికి పరీక్షలు చేయగా 49 మందికి కరోనా లక్షణాలు ఉన్నాయని పరీక్షల్లో తేలింది.