వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఎర్రబెల్లి
అశ్వారావుపేట టౌన్, ఏప్రిల్8: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతివనాలు గ్రామాలకు ఆకర్షణీయమని వాటి పరిరక్షణకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు.గురువారం నిర్వహించిన జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులతో మాట్లాడుతూ పల్లె ప్రకృతివనాలను ప్రతిరోజూ పర్యవేక్షించి వాటి అభివృద్ధ్దికి కావలసిన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ మంత్రితో పాటు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్రావు పాల్గొనగా డీపీవో, ఎంపీఓలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.